12 July, 2026 | 3:14 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

ఆదివాసీ యువతకు ఉపాధి కల్పించాలి!

17-02-2026 12:00 AM

అదివాసీ యువత ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఆ వర్గం మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో నాణ్యమైన విద్య అందకపోవడం, మధ్యలోనే చదువు ఆపేయడం వారి భవిష్యత్తును దెబ్బతీస్తోంది. నిరుద్యోగం, సరైన ఉపాధి మార్గాలు లేకపోవడం వల్ల యువత అసహనానికి గురై పెడదోవ పడుతున్నారు. మద్యం, ఇతర మత్తు పదార్థాలకు త్వరగా బానిసవ్వడం వల్ల ఆరోగ్యం, సామాజిక గౌరవం కోల్పోతున్నారు.

ఆధునిక పోకడల ప్రభావంతో తమ మూలాలను, విలువలను మరిచిపోవడం వల్ల వ్యక్తిత్వ లోపాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఆదివాసీ యువతకు వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించాలి. చైతన్య కార్యక్రమాలు, మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కలిగించాలి.

యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి క్రీడలు, కళల వైపు వారిని ప్రోత్సహించాలి. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ పథకాలతో పాటు, చదువుకున్న ఆదివాసీ యువకులు తమ దృక్పథం మార్చుకునేందుకు ముందుకు రావాలి. గ్రామాల్లో అక్రమ మద్యం తయారీని, విక్రయాలను అరికట్టడానికి పోలీసులు, ఎక్సైజ్ శాఖ కఠినంగా వ్యవహరించాలి. 

 వూకే రామకృష్ణ, ఆదిలాబాద్