3 September, 2026 | 1:47 PM

Nasha Mukt Bharat: 4 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

03-09-2026 | 11:36am

చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా(Drug trafficking), మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) గురువారం సమన్వయంతో సోదాలు నిర్వహించింది. 'మనీ లాండరింగ్ నిరోధక చట్టం' (Prevention of Money Laundering Act) కింద చేపట్టిన చర్యల్లో భాగంగా, తమిళనాడులోని చెన్నై, రామనాథపురం, అలాగే కేరళలోని కొచ్చి, కన్నూర్, మలప్పురం, త్రిసూర్ ప్రాంతాల్లోని మొత్తం 30కి పైగా ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సుమారు ఎనిమిది పోలీసు ఎఫ్‌ఐఆర్‌ల (FIRs) ఆధారంగా ఈ ఈడీ (ED) చర్య చేపట్టిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ 'నషా ముక్త్ భారత్ అభియాన్' (Nasha Mukt Bharat Abhiyaan)లో భాగంగా ఈ చర్య జరిగింది.