16 June, 2026 | 12:09 PM

ఇండోనేషియాలో భూకంపం.. పరుగులు పెట్టిన జనం

16-06-2026 10:49 AM

జకార్తా: ఇండోనేషియాలో(Indonesia Earthquake) మంగళవారం కొన్ని ప్రాంతాలను 6.7 తీవ్రతతో భూకంపం వణికించింది. ఆ తర్వాత బలమైన ప్రకంపనలు సంభవించాయని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రారంభ భూకంపం కారణంగా ఒక నిమిషం కంటే ఎక్కువ సేపు బలమైన ప్రకంపనలు సంభవించాయి. ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం గురించిన సమాచారం తక్షణమే అందుబాటులో లేదని అధికారులు తెలిపారు. భూకంపం రావడంతో జనం భయంతో పరుగులు పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ భూకంప కేంద్రం సెంట్రల్ సులవేసి ప్రావిన్స్ రాజధాని(Capital of Central Sulawesi province) అయిన పాలూకు తూర్పు-ఆగ్నేయ దిశలో 46 కిలోమీటర్ల (29 మైళ్లు) దూరంలో ఉంది. ఇది సుమారు 10 కిలోమీటర్ల (6 మైళ్లు) లోతులో సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే(US Geological Survey) తెలిపింది. ఆ తర్వాత సంభవించిన మరో భూకంపం తీవ్రత 5.2గా నమోదైంది. ఇండోనేషియాలో అనేక భూకంప ఫాల్ట్‌లు విస్తరించి ఉన్నాయి. ఇండోనేషియాలో భూకంపాలు సర్వసాధారణం. జనవరి 2021లో సులవేసి ద్వీపంలోని(Sulawesi Island) మాముజు నగరం సమీపంలో సంభవించిన 6.2 తీవ్రత గల భూకంపం కారణంగా కనీసం 100 మంది మరణించిన విషయం తెలిసిందే.