9 May, 2026 | 5:35 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు

16-12-2025 06:10 PM

నంద్యాల: నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు అయింది. నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీయే చదువుతున్న విద్యార్థి మాదక ద్రవ్యాల టోలుయెన్ తయారీ కేంద్రం నడిపిస్తున్నాడు.  డ్రగ్స్ తయారీ కేంద్రంపై మంగళవారం దాడికి పాల్పడిన తెలంగాణ నార్కోటిక్ పోలీసులు అనుమతి లేకుండా అల్ర్పాజోలమ్ డ్రాగ్ తయారు చేసినట్లు గుర్తించారు.

భారీ స్థాయిలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తు పదార్థాలను తయారు చేస్తున్న విద్యార్థి మధు, అతని తండ్రి సురేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ తయారీ, రవాణాలో అంతర్‌ రాష్ట్ర నెట్‌వర్క్ ఉందని, కీలక ఆధారాలను నార్కోటిక్స్​ బృందం  సేకరిస్తోంది. ఈ డ్రగ్స్ ముఠాలో స్థానికులతో పాటు బయటి వ్యక్తుల పాత్రపై ఉందని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మేరకు నార్కోటిక్ బృందం కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతోంది.