6 July, 2026 | 9:40 PM

Breaking News

గిరిజన దర్బార్ లో గిరిజనులు అందించిన ప్రతి విన్నపాన్ని సత్వరమే పరిష్కరించాలి   •   శివంపేట గ్రామానికి నిధుల మంజూరుపై హర్షం!   •   ప్రమాద బాధిత కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చేయూత   •   ముత్తారం ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •  

సూర్యాతండలో చిన్న జ్ఞాపకార్థంగా చలివేంద్రం ఏర్పాటు

01-05-2026 02:18 PM

ప్రారంభించిన సర్పంచ్ బానోత్ రాందాస్ నాయక్

కారేపల్లి,విజయక్రాంతి: వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ధరవత్ చిన్న నాయక్  జ్ఞాపకార్థంగా సూర్యాతండ గ్రామంలో చలివేంద్రం ను ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బానోత్ రాందాస్ ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ద్వారా ప్రయాణికులు, కూలీలు, స్థానిక ప్రజలు చల్లని తాగునీరు పొందుతూ ఎండ వేడిలో ఉపశమనం పొందుతున్నారు.

ప్రజల సేవే లక్ష్యంగా ఉచితంగా చల్లని నీటిని అందించడం ఈ చలివేంద్రం ప్రధాన విశిష్టత. చిన్న నాయక్ గ జ్ఞాపకార్థంగా ఈ చలివేంద్రాన్ని నిర్వహించడం ద్వారా ఆయన సేవా భావాన్ని కొనసాగిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.గ్రామ ప్రజలు ఈ చలివేంద్రాన్ని అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో , పంచాయతీ కార్యదర్శి భార్గవి, ఉప సర్పంచ్ సునీత రవి, మాజీ ఎంపీటీసీ పార్వతి, వీరన్న,గౌతమ్, భూక్య హర్యానాయక్, వినోద్,హరిదాస్, చరణ్ ,ప్రసాద్, రవి ఠాగూర్, డాక్టర్ గిరిబాబు, శంకర్, చరణ్,  తదితరులు పాల్గొన్నారు.