చలివేంద్రం ప్రారంభం
08-04-2026 08:06 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): మండలంలోని సీతారాంపురం పంచాయతీ సుబ్బనపల్లి గ్రామంలో బుధవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ చలివేంద్రాన్ని సర్పంచి కుంజా రవి ప్రారంభించి మాట్లాడారు. వేసవిలో ఆర్ అండ్ బి రహదారి వెంబడి ప్రయాణించే ప్రయాణికులకు దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు గ్రామస్తులు,ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. పంచాయతీ కార్యదర్శి కందుకూరి రాంబాబు, అంగన్వాడీ టీచర్ ఉపేంద్ర, కొండ్రు భాస్కర్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.




