దేవాలయం నిర్మాణం కొరకు విరాళం
12-05-2026 05:04 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని చెన్నై పాలెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతా రామాంజనేయ స్వామి గుడి నిర్మాణానికి తన వంతుగా మాజీ ఎంపీపీ మూడవత్ కొండా నాయక్ ఒక లక్ష రూపాయలు గుడి నిర్మాణానికి విరాళంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్య మంజు నాయక్ ,మాజీ సర్పంచ్ భీముడునాయక్, గుడి నిర్మాణ కమిటీ సభ్యులు సేవాలాల్ కన్వీనర్ బానోతు తులసి రామ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.






