21 August, 2026 | 12:07 PM

Breaking News

ఒకే విగ్రహం.. రెండు నివాళులు..! కాంగ్రెస్‌లో మళ్లీ వేడెక్కిన చర్చ   •   కేసముద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో   •   హెచ్.సి.యూలో సీటు సాధించిన విద్యార్థినిని సన్మానించిన సర్పంచ్   •   ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేరుతో లబ్ధిదారుల్ని తికమక పెట్టదు   •   అమెరికా పర్యటన కొనసాగించండి... అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం   •   హైదరాబాద్‎కు మాజీ సీఎం జగన్.. భారీగా వెలిసిన కటౌట్లు   •   వరలక్ష్మీ వ్రతం పూజా విధానం, తోరం కట్టే సంప్రదాయం ఇదే!   •   క్షేత్రస్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం   •   రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో   •   కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు   •  

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

22-04-2026 12:00 AM

ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేతుల మీదుగా అందజేత

భిక్కనూర్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో 77 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు చెక్కులు అందుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సునీత, ఎంపీడీవో కిరణ్ కుమార్ రెడ్డి, పశువైద్యాధికారి దేవేందర్, బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్,భిక్కనూర్ సర్పంచ్ బాల్యాల రేఖ,ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి,భాగిర్తిపల్లి సర్పంచ్ నర్సింలు,ఉప సర్పంచ్ స్వామి, లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ జె. లింగారెడ్డి, అంతంపల్లి ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మండల జనరల్ సెక్రటరీ తిరుమలేష్, పొన్నాల రంజిత్, ఉపాధ్యక్షులు నరేందర్, నర్సింహులు, సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.