9 May, 2026 | 1:08 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

మల్కాజిగిరిలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

20-11-2025 01:04 AM

మల్కాజిగిరి, నవంబర్ 19(విజయక్రాంతి) : మల్కాజిగిరి డివిజన్ రాధాకృష్ణ నగర్‌కు చెందిన జయంతి లాల్ అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ముఖ్యమం త్రి సహాయనిధికి చేసిన దరఖాస్తు మేరకు రూ.2 లక్షల ఎల్‌ఓసి మంజూరైంది. బోయిన్‌పల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ కలిసి బాధితుడికి ఎల్‌ఓసి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల వైద్య చికిత్సకు సీఎం సహాయనిధి ఆపన్న హస్తంలా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, చిన్న యాదవ్, నవీన్, మధుసూదన్ రెడ్డి, శివ గౌడ్, సుమన్ గౌడ్, సుమన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.