9 May, 2026 | 10:42 AM

Breaking News

కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •  

ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లయ్యింది..

29-09-2025 10:38 PM

ఎమ్మెల్యే పాయల్ శంకర్...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఎన్నిక సమయంలో రేషన్ డీలర్ లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. డీలర్ల నిరసన శిబిరానికి హాజరైన ఎమ్మెల్యే వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని రేషన్ డీలర్లు ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఏప్రిల్ నెల నుంచి ఆగస్టు వరకు పెండింగ్ లో ఉన్న రేషన్ డీలర్ల కమిషన్ వెంటనే చెల్లించాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్న డీలర్ల సమస్య గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మోసగిస్తూనే ఉందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాని కంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూస్తే, ప్రస్తుతం తెలంగాణ ప్రజల బ్రతుకులు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అయినదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ తో పాటు పలువురు రేషన్ డీలర్లు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.