21 March, 2026 | 9:16 PM

యాదాద్రిలో భక్తుల రద్దీ

21-03-2026 03:34 PM

ధర్మ దర్శనానికి మూడు గంటలు

స్పెషల్ దర్శనానికి రెండు గంటలు

యాదాద్రి: శని ఆదివారాలు వరుస సెలవులు రావడంతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో(Sri Lakshmi Narasimha Swamy Devasthanam ) భక్తుల రద్దీ  పెరిగింది. ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు ప్రకటించారు. కొండ కింద రింగ్ రోడ్డులో ఎటు చూసినా వాహనాలు నిలిచిపోయాయి, కొండపైన వాహన రద్దీ పెరగడంతో కొండపైకి వాహనాలను అనుమతించడం లేదని భక్తులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు కొండపైన ప్రత్యేక ఏర్పాటు చేశారు.