3 July, 2026 | 10:43 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

యాదాద్రిలో భక్తుల రద్దీ

21-03-2026 03:34 PM

ధర్మ దర్శనానికి మూడు గంటలు

స్పెషల్ దర్శనానికి రెండు గంటలు

యాదాద్రి: శని ఆదివారాలు వరుస సెలవులు రావడంతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో(Sri Lakshmi Narasimha Swamy Devasthanam ) భక్తుల రద్దీ  పెరిగింది. ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు ప్రకటించారు. కొండ కింద రింగ్ రోడ్డులో ఎటు చూసినా వాహనాలు నిలిచిపోయాయి, కొండపైన వాహన రద్దీ పెరగడంతో కొండపైకి వాహనాలను అనుమతించడం లేదని భక్తులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు కొండపైన ప్రత్యేక ఏర్పాటు చేశారు.