13 July, 2026 | 9:51 PM

Breaking News

33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •  

పత్తి కొనుగోలు చేయాలి

30-12-2025 01:16 AM

నల్లగొండ జిల్లా చండూరులో రైతుల ఆందోళన

చండూరు, డిసెంబర్ 29 (విజయక్రాంతి): పత్తి కొనాలంటూ నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని బంగారి గడ్డ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. బంగారిగడ్డ ప్రధాన రహదారి వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

పత్తి పంటను తీసుకోబోమని మిల్లు యజమానులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి వాహనాల్లో కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే, తీరా పత్తిని కొనుగోలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతామని సర్ది చెప్పారు.