17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రజల భాగస్వామ్యంతోనే కాలనీల అభివృద్ధి

14-04-2026 12:50 AM

జవహర్‌నగర్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ప్రజలందరికీ భాగస్వామ్యంతోనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రగతిలో ప్రతి పనికి ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో సొంత నిధులతో అభివృద్ధి చెందవచ్చునని జవహర్ నగర్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ తెలిపారు.

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ చంద్రపురి కాలనీలోని ముత్తుస్వామి కాలనీలో కాలనీవాసుల సహకారంతో సోమవారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ నిహారిక గౌడ్ తో కలిపి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ గొప్ప కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ నిహారిక రూ. 75000 ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు వెంకటేష్, మహేందర్‌యాదవ్, భాస్కర్‌గౌడ్, అనిల్ ముదిరాజ్, కిషోర్, కిరణ్, రవి, కర్ణాకర్, వంశీ, విజయ్,రాజు పటాన్, రాము, భరత్,రాములమ్మ, యాదలక్ష్మి, నాగమణి, శకుంతల కాలనీవాసులు పాల్గొన్నారు.