17 March, 2026 | 4:41 PM

Breaking News

ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •   కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ నెంబర్   •  

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి: కలెక్టర్

17-03-2026 02:57 PM

* గాంధారిపల్లిలో ఫామాయిల్ సాగు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టంను పరిశీలించిన కలెక్టర్ ప్రతిమ సింగ్

* హెల్త్ క్యాంపును పరిశీలించి రోగులతో ముచ్చటించిన కలెక్టర్

పాపన్నపేట: పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆశాఖ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. మంగళవారం పాపన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపును ఆమె సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల సరళిని పరిశీలించి రోగులతో ముచ్చటించారు.

అనంతరం మండల పరిధిలోని గాంధారిపల్లిలో ఫామాయిల్ సాగు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టంను పరిశీలించారు. కలెక్టర్ వెళ్లిన అనంతరం జిల్లా వైద్యాధికారి శ్రీరాం హెల్త్ క్యాంపు ను పరిశీలించారు. మెదక్ డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ వో హరిప్రసాద్, పాపన్నపేట మెడికల్ ఆఫీసర్ అన్వర్, గ్రామ సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.