16-02-2026 01:30:54 AM
హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్సే ఉండాలి
చైర్మన్లు, మేయర్ల ఎన్నికపై కాంగ్రెస్ నేతలు, మంత్రులతో సీఎం రేవంత్రెడ్డి జూమ్ సమావేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మేయర్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి ఆదివారం జూమ్ మీటింగ్ నిర్వహిం చారు. ఈ జూమ్ మీటింగ్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర వ్యవ హారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
సోమవారం మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్ల, వైస్ చైర్మన్లు ఎన్నిక సందర్భంగా వ్యవహరించాల్సిన వ్యూహంపై జూమ్ మీ టింగ్లో సీఎం దిశా నిర్దేశం చేశారు. హంగ్ మున్సిపాలిటీల్లో ఎన్ని కాంగ్రెస్కి దక్కనున్నాయో పార్లమెంట్ ఇంచార్జిలతో అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థల్లో మేయర్ల ఎన్నికపై ఇన్చార్జిలు వ్యవహరించాల్సిన అంశాలపై దిశ నిర్దేశం చేసారు. సామాజిక సమతుల్యత పాటించాలన్నారు. హంగ్ మున్సిపాలిటీల్లో ఏ ఒక్కటి చేజారకూడదని సీఎం స్పష్టం చేశారు.