సచివాలయానికి మావోయిస్టు నేతలు.. సీఎంతో భేటీ
27-02-2026 02:19 PM
హైదరాబాద్: మావోయుస్టు అగ్రనేతలు(Maoists leaders) తెలంగాణ సచివాలాయానికి చేరుకున్నారు. మావోయిస్టు అగ్రనేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీ కానున్నారు. కాసేపట్లో సీఎంతో డీజీపీ శివధర్ రెడ్డి(Telangana DGP Shivdhar Reddy), ఐజీ సుమతితో సమావేశం కానున్నారు. దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డితో చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహదారుడు కే కేశవ రావు పాల్గొనున్నారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఇటీవల కీలక మావోయస్టు నేతలు లొంగిపోయిన విషయం తెలిసిందే.




