1 July, 2026 | 9:57 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు

12-07-2025 12:18 AM

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణలో మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల్లోని 607 పోస్టులకు ఈ నెల 10 నుంచి 17వ తేదీల్లో దరఖాస్తులు తీసుకోవాల్సి ఉండగా, డాక్టర్ల విజ్ఞప్తి మేరకు ఈ తేదీల్లో మార్పులు చేశా రు.

ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనను మెడికల్ అండ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బో ర్డు విడుదల చేసింది. బోర్డు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూ చించింది. దరఖాస్తు సమయంలో బోర్డు వెబ్‌సైట్‌లో అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కుల ధృ వీకరణ తదితర సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి కొంత సమయం కావాలని డాక్టర్లు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.