బాధిత కుటుంబానికి చేయూత
కారేపల్లి, విజయక్రాంతి: కారేపల్లి మండల కేంద్రం అంబేద్కర్ కాలనీ కి చెందిన చిరుముల రాములు అనారోగ్యంతో గత వారం క్రితం మృతి చెందారు . వారి దశదిన కార్యక్రమ నిమిత్తము వారి కుటుంబానికి 5000 రూపాయలు బిఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ ఆర్థిక చేయూతను అందించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుమల రాములు మృతి చెందడంతో ఆ కుటుంబం నిరాశ్రయులయ్యారనీ బాధితులకు అండగా నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు .ఆపద సమయంలో మానవత్వం చాటి మంచి మనసున్న మనిషిగా చేయూతనందించినందుకు గాను ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు డొంకన రవీందర్ గౌడ్ ,పాలిక వీర స్వామి, కారేపల్లి మండలం బీసీ నాయకుడు పేరు వెంకటేశ్వర్లు ,యువ నాయకు చింతల సంపత్ ,ఎండి ఖలీలుల్లా ఖాన్ , సోమందుల వెంకటేశ్వర్ ,బి ఆర్ ఎస్ మైనార్టీ యువ నాయకుడు షేక్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.






