29 April, 2026 | 10:50 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

మూలవంక అడవుల్లో బయటపడ్డ మృతదేహాలు

16-09-2025 10:44 AM

హైదరాబాద్: తిరుపతి జిల్లా పాకాల మండలం మూలవంక అడవుల్లో(Moolavanka forests) మృతదేహాలు బయటపడ్డాయి. పక్కనున్న గోతుల్లో మరో ఇద్దరి చిన్నారుల మృతదేహాలను గుర్తించారు. మహిళ, పురుషుడి మృతదేహాలకు పోలీసులు శవపరీక్షలు చేయించారు. మహిళ, పురుషుడిని హత్య చేసినట్లు శవపరీక్షల్లో వైద్యులు నిర్ధారించారు. నోటిలో గుడ్డలు కుక్కి, ప్లాస్టర్ వేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు తమిళనాడు తంజావూరు కు చెందిన కలై సెల్వన్ గా గుర్తించారు. మృతురాలు తన భార్య అంటూ భర్త వెంకటేష్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య, పిల్లలు కూడా కనిపించడం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తి కోసం జరిగిన హత్యా.. పరువు హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాకాల పోలీసులు ఘటనాస్థలంలో మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.