12 May, 2026 | 11:45 AM

Breaking News

మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •  

ఇలా జరుగుతుందని కేసీఆర్‌కు ముందే చెప్పా

03-09-2025 01:33 PM

హైదరాబాద్: రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఓకే విమానంలో ప్రయాణించినప్పటి నుంచి తనపై కుట్రలు చేస్తున్నారన్న కవిత(MLC Kavitha) వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(BJP MP Raghunandan Rao) స్పందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి, హరీష్ రావు కుమ్మక్కయ్యారని ఎమ్మెల్సీ కవిత చెప్పారని, జడ్పీ అధ్యక్షుడిగా ఎవరు ఓడించారో గతంలో తాను కేసీఆర్ కు చెప్పానని రఘునందన్ రావు పేర్కొన్నారు. ఆరోజు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఇందులో ఎలాంటి దాపరికం లేదని ఆయన అన్నారు. మెదక్ ఎంపీ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు గతంలోనే తాను చెప్పానని ఎంపీ రఘునందన్ అన్నారు.