18-02-2026 12:19:22 AM
ముకరంపుర, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): కరీంనగర్లోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ విద్యార్థులు హైదరాబాద్ సిబిఐటి నిర్వహించిన జా తీయ స్థాయి ‘సీబీఐటీ హ్యాకథాన్ ఫర్ సుధీ 2026’లో ప్రథమ బహుమతిని కైవసం చే సుకున్నారు. జిట్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థు లు టి. భవానీ, షిఫా తహ్రీమ్, సిహెచ్. వైష్ణవిలు ‘గ్రీన్ జీనీ ఏఐ మరియు ఐఓటీ ఆ ధారిత స్మార్ట్ ఫార్మింగ్ సపోర్ట్ అనే ఫస్ట్ డొమైన్ ప్రాజెక్టుతో విజేతలుగా నిలిచి 12,000 నగదు బహుమతిని, ప్రశంస పత్రం గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను జిట్స్ చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, కార్యదర్శి జె. సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డా టి అనిల్ కుమార్, డీన్ అకడెమిక్స్ అండ్ ఆడిట్ డా పి కె వైశాలి, సిఎస్ఈ విభాగధిపతి డా రవీందర్ మొగిలి, కో ఆర్డినేటర్ డా. ఆర్. జగదీషన్, అధ్యాపక బృందం, విద్యార్థులు అభినందించారు.