నాగదేవత వద్ద ఏర్పాట్లు
14-08-2026 06:45 PM
నిర్మల్,(విజయక్రాంతి): నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గాంధీరామన్న దత్త సాయి ఆలయ ప్రాంగణం లో ఉన్న నాగదేవత ఆలయం ఏర్పాటు పూర్తి చేసినట్టు పూర్తి చేసినట్టు ఆలయ కమిటీ ఛైర్మెన్ కొట్టె శేఖర్ తెలిపారు. ఆలయానికి రంగులతో ముస్తాబు చేస్తున్నారు. ప్రతి ఏటా వందల సంఖ్యలో నిర్మల్ మహిళలు ఈ ఆలయాన్ని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీగా ఉంది. ఈ సారి మహిళా భక్తులు ఇబ్బందులు లేకుండా మహిళలు అధిక సంఖ్యలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవచ్చు అన్నారు ఈ కార్యక్రమం లో ధర్మకర్తలు ఉప్పుల నందు, ఆకుల నర్సయ్యచైర్మన్ వెంట ఉన్నారు






