ఇచ్చోడ పీఏసీఎస్ చైర్మన్ కోసం దరఖాస్తు
04-09-2026 | 02:09pm
ఉట్నూర్,సెప్టెంబర్04(విజయక్రాంతి): ఇచ్చోడ మండల(Ichoda Mandal) పిఎసిఎస్ చైర్మన్ పదవిని సిరికొండ మండలానికి కేటాయించాలని సిరికొండ మండల కాంగ్రెస్(Sirikonda Mandal Congress) నాయకులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు వినతి పత్రం అందజేశారు. శుక్రవారం ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంచం లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.






