26 March, 2026 | 3:28 PM

Breaking News

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిరంతరం సరఫరా.. కొరత లేదన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌   •   మార్కాపురం బస్సు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు మృతి   •   మ‌ర్యాద ఇవ్వ‌డం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ   •   గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక   •   గ్యాస్ కోసం రోడ్డెక్కిన క్యూ లైన్   •   ఆడపిల్లకు అన్యాయం... అడిగితే అక్రమ కేసులా..?   •   తాసిల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు   •   పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రారంభం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, పోలీస్ ఎస్‌హెచ్‌వోను నియమించాలి   •  

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

26-03-2026 01:51 PM

అఖిల భారత రైతుకూలి సంఘం డిమాండ్.

అన్నపురెడ్డిపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని కొండయ్య గూడెం గ్రామంలో అఖిల భారత రైతుకులి సంఘం గ్రామ సభ జరిగినది. ఈ సభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని అనంతరం జరిగిన కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ఎస్ కే ఉమర్ మాట్లాడుతూ రైతాంగ సమస్యల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాల కోసం భూమికోసం ఈ దేశ విముక్తి కోసం జరుగుతున్న అనేక రకాల ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా రైతుకూలి సంఘం నిరంతరం రైతుల పక్షాన వ్యవసాయ రంగం సమస్యలపై పోరాటాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మూడు ప్రజావ్యతిరేక రైతు వ్యతిరేక చట్టాలను ఒకటి విద్యుత్ చట్టం, విత్తన చట్టం, ఉపాధి హామీ చట్టాలను తీసుకొచ్చి ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేపట్టిందని విద్యుత్ చట్టం వల్ల స్పాట్ మీటర్లు పెట్టి సెల్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి రైతు కూలీలను ఇబ్బందులు పాలు చేసే విధంగా ఉన్నాయని. విత్తన చట్టాలు రైతులకు వ్యతిరేకమని అవి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చేస్తున్న చట్టాలని ఉపాధి హామీ చట్టం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని దాన్ని వ్యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా అహ్మద్ కార్యదర్శిగా సాయిబాబాను కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.