వరుణ్ మోటార్స్ మరో మైలు రాయి
21-08-2026 12:00 AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 555 బ్రెజ్జా కార్ల డెలివరీ
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఒకేరోజు 555 కొత్త మారుతి సుజుకి బ్రెజా కార్లను డెలివరీ చేసి వరుణ్ మోటార్స్ హైదరాబాద్ మైలురాయిని నమోదు చేసింది. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో వరుణ్ మోటార్స్ జనరల్ మేనేజర్ కృష్ణ కుమార్, ఏజీఎమ్ ఆంజనేయులు పలువురు కస్టమర్లకు ఆల్-న్యూ బ్రెజ్జా కార్లను అందజేశారు. బోల్డ్ డిజైన్, ఆధునిక ఫీచర్లు, పనితీరు, సౌకర్యం, భద్రత వంటి అంశాలతో బ్రెజ్జా ఎస్దీతిజిజియూవీ విభాగంలో ప్రత్యేక ఆదరణ పొందుతోందన్నారు.






