ఆకట్టుకున్న పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
09-06-2026 12:32 AM
మంచిర్యాల టౌన్, జూన్ 8 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (సినిమావాడ) 2006- బ్యాచ్ కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సోమ వారం ఘనంగా నిర్వహించారు. 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులంతా ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకొని వారి మధుర జ్ఞాపకాలను నెమరువెసుకొని అనందంగా గడిపారు.
విద్యాబుద్దులు నేర్పించిన అప్పటి గురువులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత మంచిర్యాల ఎంఈవో, అప్పటి ప్రధానోపాధ్యాయురాలు మాళవిక, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయురాళ్లు సత్తయ్య, రాజశేఖర్, వెంకటేశ్వర్లు, శ్రీలేఖ, సుజాత, సుమలత, సువర్ణ, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






