17 April, 2026 | 10:32 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు ముందడుగు

19-02-2026 01:07 AM

ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్

ఆదిలాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్ పోర్ట్ కోసం మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయిందని, ఎన్నికల సమయంలో కుట్ర లు, కుతంత్రాలు చేసినట్లు జిల్లా అభివృద్ధిలో విభేదాలు లేకుండా అన్ని రాజకీయ పక్షాలు కలిసి అభివృద్ధికి సహకరించాలని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. 

బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎయిర్ పోర్టుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేశారు. ఎయిర్ పోర్టుకు అనుసంధానంగా ఆదిలాబాద్ జిల్లాలో మరో 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ అభివృద్ధికి రాజకీయ పక్షాలు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.