8 April, 2026 | 4:11 PM

Breaking News

ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరిక— హెల్ప్ లైన్ నంబర్లు ఇవే   •   లక్ష్మీ నగర్ ట్రాఫిక్ ను మరిపిస్తున్న మంథని   •  

20 ఏళ్ల తర్వాత శివసేన భవన్‌లోకి రాజ్ థాకరే

05-01-2026 12:00 AM

మహారాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం

ఎన్నికల ప్రణాళిక ‘వచన నామా’ను విడుదల చేసిన బ్రదర్స్

ముంబై, జనవరి 4 : దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రాజ్ థాకరే తిరిగి శివసేన భవన్‌లోకి అడుగుపెట్టారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భేదాభిప్రాయాల వల్ల 2005లో శివసేన నుంచి బయటకు వచ్చిన ఆయన ఇన్నేళ్ల తర్వాత తన సొంత గూటికి రావడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. తన సోదరుడు ఉద్ధవ్ థాకరేతో కలిసి రాజ్ థాకరే ఒకే వేదికపై కన్పించారు. ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరూ చేతులు కలవడం మరాఠ రాజకీయాల్లో కొత్త మలుపుగా మారింది.

రాజ్ థాకరే శివసేన భవన్‌కు చేరుకోగానే ఉద్ధవ్ థాకరే వర్గ నేత సంజయ్‌రౌత్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉద్ధవ్, రాజ్ థాకరే కలిసి మున్సిపల్ ఎన్నికల ఉమ్మడి మ్యానిఫెస్టో ‘వచన నామా’ను విడుదల చేశారు. మరాఠ అస్తిత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా తాము ఒక్కటయ్యామని ఈ సోదరులు ప్రకటించారు. తమ తండ్రి దివంగత బాలాసాహెబ్ థాకరే ఆశయాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2003లో తలెత్తిన వారసత్వ పోరుకు ఈ కలయికతో తెరపడినట్లు కనిపిస్తోంది.