13 July, 2026 | 9:50 PM

Breaking News

33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •  

ఓయూలో అవినీతి అధికారి

17-12-2025 01:40 AM
  1. లంచం తీసుకుంటూ దొరికిన డీఈఈ శ్రీనివాస్

పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్‌కు వేధింపులు

రూ.6 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీలో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. పెండింగ్ బిల్లులు మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేసిన బిల్డింగ్ డివిజన్ డీఈఈ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. మంగళవారం వర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు.

యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ భవన మరమ్మతు పనులను ఓ కాం ట్రాక్టర్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ నుంచి సదరు కాంట్రాక్టర్‌కు రూ.14 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. పెండిం గ్ బిల్లులను మంజూరు చేయాలంటే తనకు రూ.11 వేలు లంచం ఇవ్వాలని బిల్డింగ్ డివిజన్ డీఈఈ రాకొండ శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. అధికారి వేధింపులతో విసిగిపోయిన కాంట్రాక్టర్..

మొద ట విడతగా రూ.5 వేలు ఆన్లున్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేర కు మిగిలిన రూ.6 వేలు లంచం మంగళవారం ఆఫీసులో శ్రీనివాస్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని, శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.