13 June, 2026 | 9:33 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు తక్షణమే సరఫరా చేయాలి   •   బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గొల్ల ప్రభు   •   జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   తెలంగాణకు బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు   •   జాతీయ సెమినార్ లో కోయగూడెం వాసికి సన్మానం   •   మైనర్ బాలికపై దాడి ఘటనను ఖండిస్తూ అశ్వాపురంలో భారీ నిరసన ర్యాలీ   •   అభివృద్ధిని అడ్డుకునే విమర్శలు మానుకుని సహకరించాలి   •   కల్లూరులో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం   •   వేశ్య కాంతల చెరువు.. తామరచెరువు బేతుపల్లి చెరువులను సర్వే చేయాలి   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •  

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

24-03-2026 12:48 AM

రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య

కోదాడ, మార్చి 23 :  పెన్షనర్ల సమస్యల సాధనకై  నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికైన రావెళ్ల సీతారామయ్యను కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల శ్రేయస్సు కోసం వారి హక్కుల సాధనకు  తన శక్తి మేరకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని అన్నారు.

ఈ సందర్భంగా సీతారామయ్య దంపతులను జిల్లా  వివిధ మండలాల శాఖల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ జాస్తి సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, కోదాడ యూనిట్ కార్యదర్శి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి  తమ్మన బోయిన వీరబాబు, అసోసియేట్ అధ్యక్షులు వి జానయ్య, ఉపాధ్యక్షులు యస్దాని, భ్రమరాంబ, సంయుక్త కార్యదర్శి భూపాల్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి హాజీ నాయక్,  పాల్గొన్నారు.