6 May, 2026 | 9:28 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

22-11-2025 01:56 AM

ఎమ్మెల్యే డా.హరీష్‌బాబు

బెజ్జూర్, నవంబర్ 21 (విజయక్రాంతి): దహేగాం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘం, ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  వరి కొనుగోలు కేంద్రాలను సిర్పూ ర్ ఎమ్మెల్యే  డా.పాల్వాయి హరీష్ బాబు అడిషనల్ కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్డిఓ దత్తారావు, డిసీఎస్‌ఓ వసంత లక్ష్మీ, జిల్లా వ్యవసాయ అధికారి బోర్కుట్ వెంకటి తో కలసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మాలని, తద్వారా మద్దతు ధరతో పాటు బోనస్ పొందవచ్చని తెలిపారు.

వర్షాలు తగ్గుము ఖం పట్టిన మీదట అభివృద్ధి పనులను చేపట్టనున్నామని, కల్వాడ నుండి ఒడ్డుగూడ వర కు రూ.41 కోట్ల అంచనాతో బ్రిడ్జిలతో సహా డబుల్ బీటీ రోడ్ నిర్మించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఏడీఓ మనోహర్, మార్కేట్ కమిటీ చైర్మన్ దేవయ్య, సింగిల్ విండో చైర్మన్ తిరుపతి గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ ధనుంజయ్, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, పీఏసీఎస్ అధికా రి,సామ్యూల్, ఎమ్మార్వో షరీఫ్ పాల్గొన్నారు.