శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: మార్చి 27న ఉదయం 9 గంటల నుండి హైదరాబాద్లో జరగనున్న శ్రీరామనవమి శోభాయాత్ర( Sri Rama Navami Shobha Yatra) దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతమైన ట్రాఫిక్(Traffic Restrictions) మళ్లింపులను ప్రకటించారు. ఊరేగింపు సీతారాంబాగ్ ఆలయం నుండి ప్రారంభమై భోయిగూడ కమాన్, మంగళ్హాట్, జాలి హనుమాన్, పురానాపూల్, గాంధీ విగ్రహం, జుమ్మెరాత్ బజార్, బేగంబజార్, ఎస్ఏ బజార్, గౌలిగూడ చమన్, పుత్లీబౌలి, సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ వ్యాయంశాల పాఠశాలకు చేరుకుంటుంది. ఊరేగింపు కదలికను బట్టి వాహనాల రాకపోకలు దశలవారీగా మళ్ళించబడతాయని ట్రాఫిక్ సంయుక్త పోలీస్ కమిషనర్ ప్రకటించారు.
ఊరేగింపు చివరి భాగం ప్రతి కూడలిని దాటిన తర్వాత ట్రాఫిక్ పునరుద్ధరించబడుతుందన్నారు. మల్లేపల్లి క్రాస్రోడ్స్, అఘాపురా క్రాస్రోడ్స్, ఘోడే-కి-ఖబర్, గాంధీ విగ్రహం, పురానాపూల్ క్రాస్రోడ్స్, టక్కర్వాడి జంక్షన్, రాణి అవంతి బాయి విగ్రహం, అలస్కా టీ జంక్షన్, ఎస్ఏ బజార్, ఎంజే మార్కెట్, పుత్లిబౌలి క్రాస్రోడ్, ఆంధ్ర బ్యాంక్ క్రాస్రోడ్, డీఎంహెచ్ఎస్ క్రాస్రోడ్, సుల్తాన్ బజార్ క్రాస్రోడ్ వద్ద ప్రధాన దారి మళ్లింపులు అమలు చేస్తారు.
బేగంబజార్ ఛత్రి, అఫ్జల్గంజ్ టి-జంక్షన్, శివాజీ బ్రిడ్జి, సిబిఎస్, రంగమహల్ వై జంక్షన్, పుత్లిబౌలి, కోటి, జిపిఓ అబిడ్స్, ఎంజె మార్కెట్, చాదర్ఘాట్, కాచిగూడ ఎక్స్ రోడ్, నింబోలిఅడ్డ వద్ద భారీ రద్దీ ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రయాణికులు ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వచ్చే అప్డేట్లను అనుసరించాలని పోలీసులు సూచించారు. 9010203626 ట్రాఫిక్ హెల్ప్లైన్ ద్వారా అత్యవసర ప్రయాణ సహాయం అందుబాటులో ఉందని పోలీసులు వెల్లడించారు.




