26 June, 2026 | 8:18 PM

ఖమ్మంలో తిరుమల జ్యువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభం

26-06-2026 07:00 PM

ఖమ్మం,(విజయక్రాంతి): హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన తిరుమల జ్యువెలరీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని శ్రీ శ్రీ హోటల్‌లో నిర్వహిస్తున్న మూడు రోజుల ఆభరణాల ఎగ్జిబిషన్‌ను మాజీ మేయర్ పూనుకొల్లు నీరజ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ జూన్ 26 నుంచి 28 వరకు కొనసాగనుంది. బంగారం, వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్‌ను సందర్శించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల జ్యువెలరీ యజమాని అమిత్, ఈశ్వరప్రగడ హరిబాబు, ఉషారాణి పాల్గొన్నారు.