వైన్స్ షాపులో చోరీ
27-08-2026 01:04 PM
కాగజ్నగర్, (విజయక్రాంతి): కాగజ్నగర్ పట్టణంలోని త్రినేత్రి వైన్స్ షాపులో గురువారం తెల్లవారుజామున 4:25 గంటల ప్రాంతంలో చోరీ జరిగింది. దుండగులు షాపులోకి చొరబడి రూ.3 వేల నగదుతో పాటు రెండు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్తో దర్యాప్తు చేపట్టారు. వైన్ షాప్ లో చెరపడ్డా డబ్బులు రెండు బాటిళ్లు మాత్రమే తీసుకు వెళ్లడంపై చర్చ జరుగుతుంది.






