12 July, 2026 | 6:10 PM

Breaking News

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •  

నిరాశ్రయులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి

25-11-2025 07:48 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.  

మిర్యాలగూడ (విజయక్రాంతి): నిరాశ్రయుల భవనంలో నిరాశ్రయులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ప్రభుత్వ సేవలు వారందరికీ అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రకాష్ నగర్ లో గల నిరాశ్రయుల విశ్రాంతి భవనాన్ని ఆమె మంగళవారం వేకువజాముననే ఆకస్మికంగా తనిఖీ చేసి వారితో ముఖాముఖి మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని గుర్రప్ప గూడానికి చెందిన సైదిరెడ్డి అనే వ్యక్తి యోగక్షేమాలు సమస్యలను అడిగి తెలుసుకోవడంతో ఆశ్రమంలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

నిరాశ్రయుల భవనాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వారి విశ్రాంతి గదిలో శుచితమైన భోజనము ఆరోగ్య పరీక్షలు సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్ నారాయణన్ అమిత్ మాలేపాటి, తహశీల్దార్ శ్రీరాముల సురేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్ఐ కృష్ణయ్య అధికారులు, సిబ్బంది తదితరులున్నారు.