8 July, 2026 | 8:20 PM

Breaking News

ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •  

విద్యా రంగానికి ప్రభుత్వం 15% నిధులు కేటాయించాలి

19-02-2026 12:00 AM
  1. టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ 
  2. కామారెడ్డి విద్యాపరిరక్షణ కమిటీ డిమాండ్ 

కామారెడ్డి, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో విద్యా విధానానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పిందని టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సకినాల అనిల్ కుమార్ అన్నారు. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని బుధవారం కామారెడ్డిలో ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు, డిమాండ్లు, తీర్మానాలను చేశారు.

రౌండ్ టేబుల్ సమావేశం  కామారెడ్డిలోని టి పి టి ఎఫ్ కార్యాలయంలో  జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంనకు ముఖ్యఅథితిగా హాజరైన విద్యాపరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకులు టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు  చకినాల అనిల్ కుమార్ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యావిధానం రద్దుకొరకు, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో విద్యకు 20శాతం బడ్జెట్ కెటాయించాలని డిమాండ్ చేస్తూ, పాఠశాలల మూసివేత నిలుపదలకొరకు ,యూనివర్సిటీల స్యయంప్రతిపత్తిని కాపాడుకొనుటకు ఉద్యమించాలని కోరారు.

విద్యాపరిరక్షణ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవులమాట్లాడుతూ ఉపాధ్యాయుల రేష్ణలైసెషన్ విధానాన్ని ఖండిస్తున్నమ్మన్నారు, విద్యా పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది.

గౌరవ అధ్యక్షులు కే శ్రీనివాస్, టి పి టి ఎఫ్ సీనియర్ నాయకులు టి హనుమండ్లు, విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు   వేణుగోపాల్, విద్య పరిరక్షణ కమిటీ జిల్లా సహా అధ్యక్షులు విజయరామరాజు, విద్యా పరిరక్షణ కమిటీ అదనపు ప్రధాన కార్యదర్శి పి అంజయ్య,డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సీ ప్రభాకర్, విశ్రాంత ఉపాధ్యాయులు జి. కిషన్ గౌడ్, కె. రాంచంద్రం, ఎస్. అంజయ్య, ఇ. గంగా ప్రసాద్, విద్యార్థి సంఘాల నాయకుడు బి విట్టల్, టిపిటిఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మి, సునీల్,కామారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి రాజకుమార్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో మూతబడిన బడులను రీఓపెన్ చేయుటకు కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోవాలని, ఉద్యమాల్లో ప్రజలను మమేకం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కే శ్రీనివాస్, టి పి టి ఎఫ్ సీనియర్ నాయకులు టి హనుమండ్లు,   విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు   వేణుగోపాల్, విద్య పరిరక్షణ కమిటీ జిల్లా సహా అధ్యక్షులు విజయరామరాజు, విద్యా పరిరక్షణ కమిటీ అదనపు ప్రధాన కార్యదర్శి పి అంజయ్య,డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సీ ప్రభాకర్, విశ్రాంత ఉపాధ్యాయులు జి. కిషన్ గౌడ్, కె. రాంచంద్రం, ఎస్. అంజయ్య, ఇ. గంగా ప్రసాద్, విద్యార్థి సంఘాల నాయకుడు బి విట్టల్, టిపిటిఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మి, సునీల్,కామారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి రాజకుమార్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.