26 April, 2026 | 3:26 AM

పొనుగోడు గ్రామస్తుల ఔదార్యం

26-04-2026 01:43 AM

చిన్నారుల పేరిట రూ.4 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్

అభినందించిన పలువురు

గరిడేపల్లి, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామానికి చెందిన యూసుఫ్ ఇటీవల మృతి చెందాడు.కాగా అతనికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఆయనది పేద కుటుంబం కావడంతో ఆ పిల్లలను దృష్టిలో ఉంచుకొని గ్రామ పెద్దలు, యువత అంతా ఒకటై వారి భవిష్యత్తుకు బాసటగా నిలిచారు.

గ్రామంలోని చెరువు కట్ట బజార్ సభ్యులు, పదవ తరగతి పూర్వ విద్యార్థులు, ఎంఐఎం టీమ్, మసీదు ఇ మహమ్మదీయ కమిటీ, షేక్ నజీర్ ఫ్రెండ్స్, గిరి ప్రసాద్ బ్యాచ్ అందరూ కలిసిరూ. రూ.4,05,081 నగదును సేకరించి ఆ మొత్తాన్ని చిన్నారుల పేరిట పోస్టాఫీస్‌లో పిక్స్ డ్ డిపాజిట్ చేశారు. పిల్లల చదువులకు, ఎదుగుదలకు బాటలు వేశారు. ఆపదలో ఉన్న ఊరి బిడ్డల కోసం పొనుగోడు చూపిన చొరవ అందరికీ స్ఫూర్తి దాయకమనీ పలువురు అభినందించారు.