13 July, 2026 | 9:51 PM

Breaking News

33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •  

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం

01-02-2026 07:14 PM

- ఏఐఎఫ్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్

ముకరంపుర,(విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని అల్ ఇండియా  ఫార్వర్డ్  బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మోడీ ప్రభుత్వం తన ఆర్థిక సార్వభౌమత్వాన్ని బాహ్య ఒత్తిళ్లకు, ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా నుండి వచ్చిన ఒత్తిళ్లకు లొంగిపోయిందని తెలుస్తుందని పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం నిధులను తీవ్రంగా తగ్గించడం గ్రామీణ కుటుంబాలకు జీవనాధారాన్ని కూల్చివేయవడమేనని తెలిపారు. దేశ జిడిపికి నిజమైన సృష్టికర్తలైన కార్మికులు, ఉద్యోగుల చట్టబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడంలో ఈ బడ్జెట్ పూర్తిగా విఫలమైందన్నారు. ఇది ప్రజా, కార్మిక, రైతు, సమాఖ్య వ్యతిరేక బడ్జెట్ అని పేర్కొన్నారు.