1 April, 2026 | 6:36 PM

Breaking News

మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •   మంథనిలో రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి   •  

డంప్ యార్డ్ కి వ్యతిరేకంగా విద్యార్థుల మానవహారం

01-04-2026 04:46 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణ శివారులోని సిర్సపల్లి వద్ద ఏర్పాటు చేసే డంప్యాడ్ను వ్యతిరేకిస్తూ ప్రవేట్ పాఠశాలల యజమాన్యాలు, విద్యార్థులు  బుధవారం నిరసనవ్యక్తం చేశారు. పట్టణ కూడలల్లో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని,మనోజ్ కుమార్  వారికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు హానిచేసే ఏ ప్రాజెక్టులకైనా వ్యతిరేకమని, పార్టీలకతీతంగా ఉద్యమం కొనసాగించాలన్నారు. డంపింగ్ యార్డ్ తో లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. డంప్యాడ్ పై ఇప్పటికే, మంత్రి పొన్నం ప్రభాకర్కి వినతి పత్రం   అందజేశామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డంపు యార్డును ఆపేందుకు  కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు  రవీందర్రావు, బండ అనుష, కాళీ క్ హుస్సేన్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రవేట్ పాఠశాల యజమాన్యాలు, ప్రజాసంఘాల నాయకులు తో పాటు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.