10 April, 2026 | 2:50 PM

Breaking News

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •  

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం భేటీ

27-09-2025 12:32 PM

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) సమావేశం అయింది. ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదినీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, అదనపు డీజీ మహేశ్ భగవత్, పంచాయతీరాజ్, ఆర్థికశాఖల ముఖ్యకార్యదర్శులు, ఎక్సైజ్ కమిషనర్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పలు విభాగాల అధికారులతో చర్చలు జరిపారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) వారికి 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఒక జీవో జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.