28 March, 2026 | 12:42 AM

అట్టహాసంగా శ్రీరామ శోభాయాత్ర

27-03-2026 10:47 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలోని 17వ వార్డులో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్రను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ శోభాయాత్ర శ్రీ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై పాత బస్టాండ్ మీదుగా శ్రీ కోదండ రామాలయం వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడారు. శ్రీరామనవమి పర్వదినం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకన్నారు. శ్రీరాముడి ఆచరణీయమైన జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో సత్యం, ధర్మం, న్యాయం నిలవాలంటే శ్రీరాముడి మార్గంలో నడవాలని ఆయన సూచించారు. ప్రజలు అందరూ ఐక్యంగా ఉండి పండుగలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.