29 May, 2026 | 8:02 PM

కల్తీ మద్యం తాగి 12 మంది మృతి, ఎనిమిది మంది అరెస్ట్

29-05-2026 05:03 PM

పుణే: మహారాష్ట్ర పింప్రి చించ్వాడ్ ప్రాంతం, పుణే నగరంలో కల్తీ మద్యంగా అనుమానిస్తున్న దాన్ని సేవించడం వల్ల కనీసం 12 మంది మరణించారని, ఈ ఘటనకు సంబంధించి ప్రధాన కల్తీ మద్యం వ్యాపారితో సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారని అధికారులు శుక్రవారం తెలిపారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనను అత్యంత తీవ్రమైనదిగా అభివర్ణించారు. కల్తీ మద్యం సరఫరాలో ప్రమేయం ఉన్న సమగ్ర వ్యవస్థను గుర్తించినందున, మరికొంతమంది వ్యక్తులు అరెస్టు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పింప్రి చించ్వాడ్ పరిధిలోని ఫుగేవారి ప్రాంతంలో ఏడుగురు, పుణేలోని హడప్సర్ పరిధిలోని పంధారే మాలా ప్రాంతంలో మరో ఐదుగురు మొత్తం 12 మంది కల్తీ మద్యం సేవించి మరణించారు. విషపూరిత మద్యం సేవించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులు పింప్రి చించ్వాడ్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.