8 June, 2026 | 6:20 PM

Breaking News

జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •   రసాభాసగా మారిన వార్డు సభ సమావేశాలు   •  

అప్పాయిగూడెంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక గ్రామ సభ

08-06-2026 05:04 PM

కారేపల్లి,(విజయక్రాంతి): అప్పాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా అప్పాయిగూడెం రైతు వేదికలో స్థానిక సర్పంచ్ దండు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇంచార్జ్ ఎంపీడీవో మల్లెల రవీంద్ర ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని  ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, తాగునీటి సమస్యల పరిష్కారం, వ్యవసాయాభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, విద్య, ఆరోగ్య సేవల మెరుగుదలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై గ్రామస్తులతో విస్తృతంగా చర్చించారు. గ్రామ ప్రజల నుంచి సమస్యలు, అవసరాలు, సూచనలను స్వీకరించిన అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.