24 April, 2026 | 6:35 PM

Breaking News

విశారదన్ మహారాజ్ ముందస్తు అరెస్ట్   •   పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్   •   బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి   •   నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •  

కాలేశ్వరం కాలువల పనులు పూర్తి చేయాలని రిలే దీక్ష

25-02-2026 05:19 PM

తంగళ్ళపల్లి,(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రం పెద్ద లింగాపూర్ గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలు 11/6, 11/5, 11/4 పరిధిలో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు బస్వాపూర్ సర్పంచ్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పూర్మనీ రాజశేఖర్ రెడ్డి మద్దతు తెలిపారు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ ప్రజలు, రైతులు ఐక్యంగా దీక్షలో పాల్గొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి కాలువ పనులు పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.