7 April, 2026 | 5:04 PM

Breaking News

ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిలువెత్తు దండతో ఘనంగా సన్మానం   •   చంద్ర మహంకాళి ఆలయంలో పూజలు   •   గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక   •   పేదల స్వంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం: ధరావత్ వీరన్న నాయక్   •   'టచ్ చేసి చూడు.. పాకిస్థాన్‌ ముక్కలే'! పాక్‌కు భారత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌   •   గిరిజన గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం నిర్వహణ   •   రసాయనాల నియంత్రణతో క్యాన్సర్ నివారణ   •   ఘనంగా జీవీఆర్ జన్మదిన వేడుకలు   •   పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్   •   ఐఎన్టీయుసీ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎస్కే బాజీ సాహెబ్   •  

12న పల్స్ పోలియో వ్యాక్సినేషన్

09-10-2025 12:45 AM

రాష్ట్రంలోని 6 జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఈ నెల 12న రాష్ర్టంలోని 6 జిల్లాల్లో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. రాష్ర్టంలో పోలియో చివరి కేసు 2007లో, దేశంలో 2011లో నమోదయ్యింది. మూడేండ్లుగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర దేశాల్లో పోలియో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి భారత్‌కు రాకపోకలు జరుగుతున్న జిల్లాల్లో పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

ఇందుకోసం దేశవ్యాప్తంగా 290 జిల్లాలను ఎంపిక చేయగా, ఇందులో మన రాష్ర్టం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ ఉన్నాయి. ఈ ఐదు జిల్లాలతోపాటు వరంగల్ జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతంలోనూ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ 6 జిల్లాల పరిధిలో ఐదేండ్లలోపు పిల్లలు 17,56,789 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.