15 July, 2026 | 1:09 PM

Breaking News

డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. పోలీసుల పహారాలో ఇంట్లోనే దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •   నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి   •   శ్వాసనాళంలో చిక్కుకున్న ఈలను తొలగించిన వైద్యులు   •   జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో గ్యాస్ లీక్‌తో మంటలు   •   ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలి   •  

మెడిసిటీ ఆస్పత్రి వద్ద రోగి బంధువుల ఆందోళన

20-12-2025 01:12 AM

మేడ్చల్ అర్బన్ డిసెంబర్ 19(విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని మెడిసిటీ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన మహిళను ఆపరేషన్ చేసి వైద్యులు మధ్యలో వదిలేశారని బంధువులు ఆసుపత్రి ప్రధాన గేటు ముందు ఆందోళనకు దిగారు.అలియాబాద్ కు చెందిన పుష్పలత అనే మహిళ గత నాలుగు రోజుల క్రితం మెడిసిటీ ఆసుపత్రిలో హెర్నియా సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు బంధువులు తెలియజేశారు.

ఆసుపత్రిలో మహిళను అన్ని టెస్టులు చేసి సర్జరీ చేస్తామని చెప్పి సర్జరీ మధ్యలోనే ఆపేసి సరైన పరికరాలు లేవని చేతులెత్తేసినట్లు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో మహిళను సర్జరీ చేసి మధ్యలోనే వదిలేసి వేరే ఆసుపత్రికి తీసుకువెళ్ళమని కుటుంబ సభ్యులను మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు ఒత్తిడి చేశారని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగినట్లు చెప్పారు.