2 July, 2026 | 3:27 PM

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •  

క్రిమిసంహారక మందు సేవించి ఒకరి మృతి

03-11-2025 07:07 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన మంగళారపు మల్లారెడ్డి క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ యుగంధర్ గౌడ్ తెలిపిన వివరాలను ప్రకారం గొల్లపల్లి గ్రామానికి చెందిన మంగళారపు మల్లారెడ్డి ఆదివారం రాత్రి తన కుటుంబ సభ్యులకు తాను ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్లో తెలియజేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

వెంటనే ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నించినప్పటికీ సమాచారం లభించలేదు. కాగా ఉదయం గోకారం గ్రామం పరిధిలో మృతదేహం ఉన్నట్లు తెలియడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు గుర్తించడం జరిగిందని తెలిపారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించి మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు తెలిపారు.