11 May, 2026 | 10:49 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

ప్లేఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్

22-05-2025 12:18 AM
  1. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం
  2. రాణించిన సూర్యకుమార్.. బౌలర్ల సమిష్టి ప్రదర్శన

ముంబై, మే 21: ఐపీఎల్-18వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. బుధవారం సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇప్ప టికే ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ౧౧వ సారి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టడం విశేషం. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్) కీలక ఇన్నిం గ్స్‌తో అలరించగా.. తిలక్ వర్మ (27), రికెల్‌టన్ (25), నమన్ దిర్ (24 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై పరాజయం చవి చూసింది. సమీర్ రిజ్వీ (39) టాప్ స్కోరర్‌గా నిలవగా.. విప్రజ్ నిగమ్ (20) పర్వాలేదనిపించాడు. నేడు జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.