2 May, 2026 | 9:21 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

అల్లుడు దాడి చేయడంతో అత్త మృతి

02-05-2026 08:02 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): బలవంతంగా అత్తను  బైక్ పై ఎక్కించుకొని  తీసుకెళ్తూ అల్లుడు  దాడి చేయడంతో అత్త మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అల్లుడుని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివసించే కర్రు కావ్య (19) ఏడాది క్రితం స్నేహిత్ తో ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం అనంతరం ఇద్దరు అదే కాలనీలో నివసిస్తున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా  అదే కాలనీలోని మరో వీధిలో ఉంటున్నారు.

కావ్యకు ఒక అక్క కూడా ఉంది. ఏప్రిల్ 28న కావ్య అక్క తల్లిదండ్రు ల ఇంటికి రావడంతో, తల్లి కొల్లా అరుణ (39) కావ్యను  కూడా రమ్మని ఇంటికి పిలిచింది. ఆరోజు మధ్యాహ్నం కావ్య తల్లి ఇంటికి వెళ్ళింది. అదే రోజు రాత్రి స్నేహిత్ అత్తకు పలుమార్లు ఫోన్ చేసి, కావ్య ప్రవర్తనపై అసభ్యంగా మాట్లాడినట్టు తెలిసింది. దీంతో అరుణ మానసికంగా ఆందోళనకు గురైంది. మరుసటి రోజు 29న మధ్యాహ్నం అరుణ బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి మెట్లు ఎక్కుతుండగా, అక్కడికి వచ్చిన స్నేహిత్ అత్తతో గొడవపడి బలవంతంగా బైకుపై తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అరుణకు ఫిట్స్ వచ్చి బైక్ పై నుండి పడిపోయిందని, స్నేహిత్, కావ్య కు ఫోన్ ద్వారా తెలిపాడు.

తొలుత అరుణను సమీపంలోని మెడిస్టార్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం బోడుప్పల్ లోని ఆర్ బిఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన కావ్య, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా నిజం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ దృశ్యాలలో స్నేహిత్, బైక్ పై వెళుతూ అరుణతో వాగ్వాదానికి దిగినట్లు, అనంతరం హెల్మెట్ తో తలపై దాడి చేయడంతో రన్నింగ్ లో ఉన్న బైక్ పై నుంచి ఆమె రోడ్డుపై పడిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అరుణ చికిత్స పొందుతూ ఏప్రిల్ 30 సాయంత్రం మృతి చెందింది. కావ్య ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు నిందితుడు స్నేహిత్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.