2 September, 2026 | 4:27 PM

తెలంగాణను చీటింగ్ చేసిన కాంగ్రెస్

02-09-2026 | 03:36pm

హైదరాబాద్: తెలంగాణంలో కాంగ్రెస్ పార్టీ(Congress party) అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా, ఆ పార్టీలోని కొద్దిమంది సభ్యులు మినహా మరెవరూ సంబరాలు చేసుకోవడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Minister Kishan Reddy) పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి తెలంగాణ కథ నెరవేరని హామీల కథగానే మిగిలిపోయిందని, గరీబ్, యువ వర్గాల నుండి అన్నాదాత, నారీ వర్గాల వరకు సమాజంలోని ప్రతి వర్గం 6 గ్యారెంటీలు, 420 హామీల నెరవేర్పు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయని ఆయన మండిపడ్డారు.

1,000 రోజులు పూర్తయి ఉండవచ్చు, కానీ అంతకంటే ముఖ్యంగా, ఈ 5 ఏళ్ల భయానక కథ ముగియడానికి ఇంకా 825 రోజులు మిగిలి ఉన్నాయన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఈ అవినీతి, పనికిమాలిన, దేనికీ లొంగని ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించడానికి ఓటు వేయడానికి కౌంట్‌డౌన్ ప్రారంభించారని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణను ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ చేసిందని, ఆరు గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి కోతలు పెట్టారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నాని రోజు ఏ ఒక్క హామికి పూర్తి న్యాయం చేయలేదని, తమ హక్కుల కోసం అన్ని వర్గాల వారు రోడ్డెక్కుతున్నారని కేంద్రమంత్రి తెలిపారు.

https://x.com/kishanreddybjp/status/2095035607722660228/photo/1